గోవా సీఎం ప్రమోద్ సావంత్ కు కరోనా

గోవా సీఎం ప్రమోద్ సావంత్ కు కరోనా

పనాజీ: గోవా సీఎం ప్రమోద్ సావంత్ కు కరోనా సోకింది. బుధవారం నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు వైరస్ పాజిటివ్ గా తేలింది. తనకు కరో్నా లక్షణాలు (అసింప్టోమేటిక్) లేవని, హోం క్వారంటైన్ లో ఉండనున్నట్లు సావంత్ తెలిపారు. ‘నాకు కరో్నా పాజిటివ్ గా తేలిందని అందరికీ తెలియజేస్తున్నా. నాకు కరోనా అసింప్టోమేటిక్. హోం ఐసోలేషన్ లో ఉండాలని నిర్ణయించుకున్నా. ఇంటి వద్ద నుంచే నా విధులను నిర్వహిస్తా. నాతో కాంటాక్ట్ లో ఉన్న వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నా’ అని సావంత్ ట్వీట్ చేశారు. గోవాలో కరోనా కేసులు 18,006కు చేరుకున్నాయి. వైరస్ బారిన పడి గోవాలో 194 మంది చనిపోయారని అధికారులు తెలిపారు.