హైదరాబాద్ నుంచి నేరుగా మాల్దీవులకు గోఎయిర్ విమాన సర్వీసు

హైదరాబాద్ నుంచి నేరుగా మాల్దీవులకు గోఎయిర్ విమాన సర్వీసు

సామాన్య ధరల విమానయాన సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న గోఎయిర్…లేటెస్టుగా హైదరాబాదు నుంచి నేరుగా మాల్దీవులకు విమాన సర్వీసు నడిపేందుకు చర్యలు చేపట్టింది. ఈ నెల 11 నుంచి హైదరాబాద్ నుంచి మాల్దీవుల రాజధాని మాలే నగరానికి విమానం నడపనుంది. ఈ రెండు నగరాల మధ్య ఇదే ఫస్ట్ డైరెక్ట్ విమాన సర్వీసు. ఈ విమాన సర్వీసు వారంలో నాలుగు రోజులు అందుబాటులో ఉండనుంది. సోమవారం, మంగళవారం, గురువారం, ఆదివారం హైదరాబాద్ రోజుల్లో మాలే విమాన సర్వీసును నడపనున్నారు.

గోఎయిర్ ఈ రూట్లో తన ఎయిర్ బస్ A 320 నియో విమానాన్ని నడపనుంది. ఉదయం 11.30 గంటలకు హైదరాబాదులో స్టార్ట్ అయ్యే ఈ విమానం మాలే కాలమానం ప్రకారం 1.30 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో స్థానిక కాలమానం ప్రకారం 2.30 గంటలకు మాలేలో బయల్దేరి 5.30 గంటలకు హైదరాబాద్ కు వస్తుంది.