సివిల్స్ ర్యాంకర్లకు గవర్నర్ సన్మానం

సివిల్స్ ర్యాంకర్లకు గవర్నర్ సన్మానం

 హైదరాబాద్, వెలుగు: సివిల్స్ ర్యాంకర్లను గవర్నర్  సీపీ రాధాకృష్ణన్  సన్మానించారు. గురువారం రాజ్ భవన్​లోని  సంస్కృతి కమ్యూనిటీ హాల్​లో బీసీ స్టడీ సర్కిల్  ఆధ్వర్యంలో ఏపీ, తెలంగాణ సివిల్స్  ర్యాంకర్లతో ఇన్​స్పైర్ 2024 కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి గవర్నర్  చీఫ్ గెస్ట్​గా హాజరై మాట్లాడారు. ప్రతిఒక్కరి జీవితంలో గెలుపోటములు సాధారణమని, ఓటమి పాలయినప్పుడు నిరాశ చెందకుండా ముందుకెళ్లాలని సూచించారు.

 తాను రెండుసార్లు ఎంపీగా గెలిచి, తర్వాత వరుసగా మూడుసార్లు ఓడానని గుర్తుచేశారు. ఏటా తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మందికి సివిల్స్  ర్యాంకులు వస్తున్నాయని, ఈ ఏడాది కూడా ఎక్కువ మంది సెలక్ట్  అయ్యాయని తెలిపారు.