హైదరాబాద్, వెలుగు: సివిల్స్ ర్యాంకర్లను గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ సన్మానించారు. గురువారం రాజ్ భవన్లోని సంస్కృతి కమ్యూనిటీ హాల్లో బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఏపీ, తెలంగాణ సివిల్స్ ర్యాంకర్లతో ఇన్స్పైర్ 2024 కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి గవర్నర్ చీఫ్ గెస్ట్గా హాజరై మాట్లాడారు. ప్రతిఒక్కరి జీవితంలో గెలుపోటములు సాధారణమని, ఓటమి పాలయినప్పుడు నిరాశ చెందకుండా ముందుకెళ్లాలని సూచించారు.
తాను రెండుసార్లు ఎంపీగా గెలిచి, తర్వాత వరుసగా మూడుసార్లు ఓడానని గుర్తుచేశారు. ఏటా తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మందికి సివిల్స్ ర్యాంకులు వస్తున్నాయని, ఈ ఏడాది కూడా ఎక్కువ మంది సెలక్ట్ అయ్యాయని తెలిపారు.