పెళ్లయిన 30 ఏళ్ల తర్వాత కాలేజీకి..

పెళ్లయిన 30 ఏళ్ల తర్వాత కాలేజీకి..

55 ఏళ్ల వయసులో లా కంప్లీట్ చేసిన గుజరాత్ మహిళ

4 గోల్డ్ మెడల్స్ కొట్టింది

55 ఏళ్ల వయసులో లా కంప్లీట్ చేయడమే గొప్ప. అలాంటిది 4 గోల్డ్ మెడల్స్ కూడా సాధిస్తే ఎలా ఉంటుంది? ఇదిగో ఈ అరుదైన ఘనత సాధించింది గుజరాత్‌కు చెందిన నీతీ రావల్. ఆమెకు ఒక కూతురు, ఒక కొడుకు. కూతురికి పెళ్లయింది. కొడుకు లాయర్‌గా స్థిరపడ్డాడు. ఏళ్లుగా కుటుంబ బాధ్యతలను మోసిన నీతికి ఇంట్లో ఒంటరిగా ఉండడం నచ్చలేదు. ఏదైనా కొత్తగా చేయాలనుకుంది. ఎవరేం అనుకున్నా పర్వాలేదని 30 ఏళ్ల తర్వాత మళ్లీ కాలేజీకి వెళ్లింది. గుజరాత్ యూనివర్సిటీ నుంచి లా కంప్లీట్ చేసింది. ఇటీవల జరిగిన కాన్వొకేషన్ డేలో 4 గోల్డ్ మెడల్స్ అందుకొని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. రావల్ ఇంతటితో ఆగిపోవాలని అనుకోవడం లేదు! మాస్టర్ ఇన్ లా అడ్మిషన్ కూడా తీసుకుంది. ‘‘నాకు ఒక్క దానికే ఇంట్లో ఏం చేయాలో తోచలేదు. అందుకే ఏదైనా చేయాలని అనుకున్నాను” అని చెప్పారు నీతి రావల్. పెళ్లయిన 30 ఏళ్ల తర్వాత ఈ ఘనత సాధించినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు ఆమె భర్త మౌలిన్ రావల్.