- మరో జవాన్కు తీవ్రగాయాలు
- ఛత్తీస్గఢ్లో ఘటన
భద్రాచలం,వెలుగు : ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణ్పూర్-దంతెవాడ జిల్లాల సరిహద్దులో బుధవారం రాత్రి గన్ మిస్ఫైర్ అవడంతో డీఆర్జీ జవాన్ చనిపోగా, మరో జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు. దంతెవాడ జిల్లా బార్సూర్ పీఎస్పరిధిలోని హాంద్వాడా, హితావాడా అటవీ ప్రాంతంలో డీఆర్జీ, బస్తర్ ఫైటర్స్
సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
ఈ సమయంలో ఓ జవాన్ చేతిలో ఉన్న తుపాకీ మిస్ఫైర్ కావడంతో జోగ్రాజ్ కర్మా, పరశురాం అలామీలకు తూటాలు తగిలాయి. వీరిద్దరినీ చికిత్స కోసం తరలిస్తుండగా జోగ్రాజ్కర్మా మార్గమధ్యలో మృతి చెందారు. పరశురాం అలామీని హెలీకాప్టర్ ద్వారా రాయ్పూర్కు తరలించి వైద్యం అందిస్తున్నారు.