జేఈఈలో గురుకుల విద్యార్థుల సత్తా..మంత్రి పొన్నం అభినందన

జేఈఈలో గురుకుల విద్యార్థుల సత్తా..మంత్రి పొన్నం అభినందన

హైదరాబాద్, వెలుగు: ఐఐటీ, ఎన్ఐటీలో ప్రవేశం కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ప్రవేశ పరీక్షలో బీసీ గురుకుల పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు.  శ్రీనివాస్ అనే విద్యార్థి 97.51 శాతం మార్కులు సాధించగా.. వైష్ణవి  96.78 శాతం మార్కులు సాధించింది. 90 శాతం కంటే ఎక్కువగా 8 మంది అబ్బాయిలు, 6 మంది అమ్మాయిలు మార్కులు పొందారు. మొత్తం 44 మంది అబ్బాయిలు,  28 మంది అమ్మాయిలు మొత్తం 72 మంది క్వాలిఫై అయ్యారు.

 జేఈఈ ప్రవేశ పరీక్షలో బీసీ  గురుకుల విద్యార్థులు మంచి మార్కులు సాధించడంపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, బీసీ గురుకులాల సెక్రటరీ సైదులు హర్షం వ్యక్తం చేశారు. గురుకులాల్లో నాణ్యమైన విద్యను అందించటానికి తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.