- అమెరికాలో ఎన్నారైల మీట్అండ్ గ్రీట్లో హరీశ్రావు
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ పదేండ్ల పాలనతో పంజాబ్ను మించి తెలంగాణ ధాన్యం ఉత్పత్తి చేసిందని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. ప్రతి రంగంపైనా దృష్టిపెట్టడం వల్లే తెలంగాణ ప్రగతి సాధ్యమైందన్నారు. గురువారం అమెరికాలోని న్యూజెర్సీ హల్దీమౌంట్లారెల్లో మీట్అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విజన్ లేని రేవంత్ పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. కనీసం ఒక్క ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారని ఆరోపించారు.
