త్రిపుర: అసలే కరోనా భయంతో హోం క్వారంటైన్ లో ఉన్న ఇద్దరు అమ్మాయిలపట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు ఓ పంచాయతీ రాజ్ ఉద్యోగి. ఈ సంఘటన నార్త్ త్రిపురలోని ఉనాకోటి సమీపంలోని కుమార్ ఘాట్ ప్రాంతంలో జరిగింది. కరోనా అనుమానంతో ముందు జాగ్రత్తగా ఇద్దరు బాలికలను అధికారులు హోమ్ క్వారంటైన్ లో ఉంచారు. ఇదే ప్రాంతానికి చెందిన పంచాయితీ రాజ్ ఉద్యోగి రిజబ్ కాంతిదేబ్, తనను తాను పారా మెడికల్ సిబ్బందిగా పరిచయం చేసుకుని వెళ్లి, వారి ఆరోగ్యాన్ని పరిశీలించాలంటూ చెప్పి, అసభ్యంగా ప్రవర్తించాడు.
వారిద్దరి ఫోన్ నంబర్లనూ తీసుకుని, వారికి తరచూ ఫోన్ చేసి వేధింపులకు గురి చేశాడు. దీంతో విసిగిపోయిన బాలికలు, విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది. ఈ విషయం తెలుసుకున్న రిజబ్, ప్రస్తుతం పరారీలో ఉండగా, పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.