హర్యానలో జర్నలిస్టులకు రూ. 10 లక్షల బీమా

హర్యానలో జర్నలిస్టులకు రూ. 10 లక్షల బీమా

హర్యానా : తమిళనాడు, మహారాష్ట్రలో పలువురు జర్నలిస్టులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడుతున్నాయి. హర్యాన ప్రభుత్వం జర్నలిస్టులకు ప్రమాద బీమా కల్పించింది. ప్రతి జర్నలిస్టుకు రూ. 10 లక్షల చొప్పున బీమా కల్పిస్తున్నట్లు తెలిపారు హర్యానా సీఎం మనోహర్ లాల్‌ ఖట్టర్.

సీఎం మనోహర్‌ లాల్‌ నిర్ణయం పట్ల హర్యానా జర్నలిస్టులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ పై యుద్ధం చేస్తున్న వారిలో జర్నలిస్టులు కూడా ఉన్న విష‌యం తెలిసిందే. కరోనాపై ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. దానికి సంబంధించిన వార్తలను ప్రజలకు చేరవేస్తున్నారు.