విమెన్స్‌‌‌‌‌‌‌‌ క్రికెటర్ల కోసం హెచ్‌‌‌‌‌‌‌‌సీఏ డొమెస్టిక్‌‌‌‌‌‌‌‌ లీగ్స్‌‌‌‌‌‌‌‌

విమెన్స్‌‌‌‌‌‌‌‌ క్రికెటర్ల కోసం హెచ్‌‌‌‌‌‌‌‌సీఏ డొమెస్టిక్‌‌‌‌‌‌‌‌ లీగ్స్‌‌‌‌‌‌‌‌

నిజామాబాద్‌‌‌‌‌‌‌‌: జాతీయ స్థాయి, డబ్ల్యూపీఎల్‌‌‌‌‌‌‌‌ వంటి లీగ్‌‌‌‌‌‌‌‌ల్లో రాణించేలా విమెన్స్‌‌‌‌‌‌‌‌ క్రికెటర్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తామని హెచ్‌‌‌‌‌‌‌‌సీఏ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ అర్శనపల్లి జగన్‌‌‌‌‌‌‌‌మోహన్‌‌‌‌‌‌‌‌రావు అన్నారు. బుధవారం నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ గిరిరాజ్‌‌‌‌‌‌‌‌ డిగ్రీ కాలేజ్‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్స్‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేసిన సమ్మర్‌‌‌‌‌‌‌‌ క్యాంప్‌‌‌‌‌‌‌‌ ముగింపు కార్యక్రమానికి జ‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌న్‌‌‌‌‌‌‌‌మోహ‌‌‌‌‌‌‌‌న్ రావు, హెచ్‌‌‌‌‌‌‌‌సీఏ ప్రధాన కార్యద‌‌‌‌‌‌‌‌ర్శి దేవ్‌‌‌‌‌‌‌‌రాజ్‌‌‌‌‌‌‌‌, కోశాధికారి సీజే శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజ‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌య్యారు. ఈ సంద‌‌‌‌‌‌‌‌ర్భంగా జ‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌న్‌‌‌‌‌‌‌‌మోహ‌‌‌‌‌‌‌‌న్ రావు మాట్లాడుతూ ఈ క్యాంప్‌‌‌‌‌‌‌‌లో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ మంది క‌‌‌‌‌‌‌‌నిపిస్తుండ‌‌‌‌‌‌‌‌డం శుభ ప‌‌‌‌‌‌‌‌రిణామం అన్నారు.

క్రికెట్‌‌‌‌‌‌‌‌కు అమ్మాయిలు, వారి త‌‌‌‌‌‌‌‌ల్లిదండ్రులు ఇస్తున్న ప్రాధాన్యత‌‌‌‌‌‌‌‌ను దృష్టిలో పెట్టుకుని తాము కూడా వారికి అన్ని విధాలా ప్రోత్సాహం అందించేందుకు కృషి చేస్తామ‌‌‌‌‌‌‌‌న్నారు. దేశంలోనే తొలిసారిగా విమెన్స్‌‌‌‌‌‌‌‌ క్రికెటర్ల కోసం డొమెస్టిక్స్ లీగ్స్ ను ప్రవేశపెడుతున్నట్టు దేవ్ రాజ్ వెల్లడించారు. అమ్మాయిల‌‌‌‌‌‌‌‌కు త్వర‌‌‌‌‌‌‌‌లో ఒక ప్రత్యేక క్రికెట్ అకాడ‌‌‌‌‌‌‌‌మీని ఏర్పాటు చేస్తామ‌‌‌‌‌‌‌‌న్నారు. నిజామాబాద్‌‌‌‌‌‌‌‌లో 6 ఎక‌‌‌‌‌‌‌‌రాల్లో కొత్త స్టేడియం నిర్మిస్తామ‌‌‌‌‌‌‌‌ని, వ‌‌‌‌‌‌‌‌చ్చే ఏడాది అక్కడే స‌‌‌‌‌‌‌‌మ్మర్ క్యాంప్ నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేస్తామ‌‌‌‌‌‌‌‌ని సీజే శ్రీనివాస్ అన్నారు. ఈ జిల్లాకే చెందిన బాక్సర్ నిఖ‌‌‌‌‌‌‌‌త్ జ‌‌‌‌‌‌‌‌రీన్‌‌‌‌‌‌‌‌ను ఆద‌‌‌‌‌‌‌‌ర్శంగా తీసుకుని విమెన్స్‌‌‌‌‌‌‌‌ క్రికెట‌‌‌‌‌‌‌‌ర్లు మ‌‌‌‌‌‌‌‌రింత మంది ముందుకు రావాల‌‌‌‌‌‌‌‌ని, ఆస్థాయిలో ఎద‌‌‌‌‌‌‌‌గాల‌‌‌‌‌‌‌‌ని ఆయన ఆకాంక్షించారు.