స్టేడియంలో ఏడ్చిన భారత అమ్మాయిలు

స్టేడియంలో ఏడ్చిన భారత అమ్మాయిలు

మెల్‌ బోర్న్‌:  ICC ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ లో భారత్ ఘోరంగా ఓడిపోవడంతో ప్లేయర్లు కన్నీరు పెట్టుకున్నారు. వరుస విక్టరీలతో ఫైనల్ చేరి చరిత్ర సృష్టించిన భారత్.. ఫైనల్లో ఓడి పోవంతో ఫ్యాన్స్ కూడా తట్టుకోలేక పోయారు. ముఖ్యంగా టోర్నీ ఆసాంతం యువ సంచలనం షఫాలీ వర్మ మెరుపు బ్యాటింగ్‌ తో అదరగొట్టింది. కీలకమైన ఫైనల్ ఫైటింగ్ లో షఫాలీ 2 రన్స్ కే ఔటవగానే భారత్‌ పై ఒత్తిడి పెరిగింది. ఆ తర్వాత స్మృతి, హర్మన్, వేదా.. ఇలా వరుసగా ఔట్ కావడంతో భారత్ కు ఓటమి తప్పలేదు.

అయితే .. టోర్నీలో వరుసగా గెలిస్తూ వచ్చిన అమ్మాయిలు.. ఈ ఫైనల్ గెలిచి విదేశీ గడ్డమీద కప్ కొట్టి చరిత్ర సృష్టించాలనుకున్నారు. కానీ.. ఆస్ట్రేలియాను తక్కువ స్కోరుకు కట్టడి చేయలేక పోయారు. కనీసం బ్యాటింగ్ తోనైనా రాణించాలనుకున్న అమ్మాయిలకు అదృష్టం వరించలేదు. ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో 85 పరుగుల తేడాతో ఓటమిపాలవడంతో భారత అమ్మాయిలు కన్నీటి పర్యంతమయ్యారు. ఐదోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఆనందంలో ఆసీస్‌ జట్టు సంబరాల్లో మునిగిపోయింది.

మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఒక్కసారిగా భావోద్వేగానికి లోనైన 16ఏండ్ల షఫాలీ కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో సహచర క్రీడాకారిణి వర్మను ఓదార్చింది. తుది సమరంలో భారత్‌ ఓడినప్పటికీ భారతీయులు అమ్మాయిలకు మద్దతుగా నిలిచారు. గతంలో ఏ జట్టుకు సాధ్యం కాకపోయినప్పటికీ తొలిసారి ఫైనల్‌ చేసి అబ్బురపరిచారని కొనియాడారు. 16ఏండ్ల వయసులోనే షఫాలీ చూపిస్తున్న తెగువకు మేమంతా ఫిదా అయినట్లు నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. పైగా నేడు ఉమెన్స్ డే కావడంతో.. గెలిస్తే మంచి మెమోరబుల్ మ్యాచ్ గా ఉండేదంటున్నారు ఫ్యాన్స్.