బంగాళఖాతంతో పాటు అరేబియా సముద్రంలోను ఒకేసారి అల్పపీడనాలు ఏర్పడడంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దక్షిణ భారతం అంతటా మేఘాలు కమ్ముకున్నాయి. పలు ప్రాంతాలలో ఒక్కసారిగా ఉదయం నుంచి వాతావరణం మారిపోయింది. తెలుగు రాష్ట్రాలు సహా పలు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాభావం ఉందని తెలిపింది హైదరాబాద్ వాతావరణ శాఖ.
అల్పపీడనాలకు.. ఉపరితల ఆవర్తనం తోడు కావడంతో దక్షిణ భారతంలోని చాలా ప్రాంతాలలో తేలికపాటి నుండి అధిక వర్షపాతం ఉంటుందని తెలిపింది. ఈ కారణంగా వారం రోజులపాటు వర్షాలు పడే అవకాశముందని అధికారులు హెచ్చరించారు.
గడచిన 24 గంటల్లో తెలంగాణలోని హైదరాబాద్ సహా పలు జిల్లాలలో సాధారణ వర్షపాతం నమోదైంది. ఆంధ్రప్రదేశ్ లోని పలు చోట్ల కూడా ఇదే విధంగా వర్షాలు కురుస్తున్నాయి.