కోల్కతా: కోల్కతాలో భారీ డ్రగ్రాకెట్ను పోలీసులు మంగళవారం ఛేదించారు. ఇద్దరు డ్రగ్ ట్రాఫికర్లను అరెస్టు చేసి, వారి నుంచి 25 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ దాదాపు రూ.105 కోట్లకు పైనే ఉంటుందని అధికారులు చెప్పారు. ఇటీవలి కాలంలో ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడడం ఇదే ప్రథమం అని అన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు నగరంలోని పైక్పారా ఏరియాలో పోలీసులు సోదాలు చేశారు. ఓ ఇంట్లో తలదాచుకున్న యూపీ డ్రగ్డీలర్జుబేర్ను, మణిపూర్కు చెందిన మౌలానా ఫయాజుద్దీన్ను అదుపులోకి తీసుకున్నారు.
జుబేర్ నుంచి 20 కిలోల హెరాయిన్ను, ఫయాజుద్దీన్ నుంచి 5.25 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్ను ఇతర డ్రగ్స్తో కలిపి లోకల్గా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. జుబేర్, ఫయాజుద్దీన్లపై నార్కోటిక్ డ్రగ్స్చట్టం కింద కేసు నమోదు చేసి, విచారిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
see also: ఏమైనా చేస్కోండి సీఏఏ ఉంటది