రేపు ఈడీ ముందుకు హీరోయిన్‌ ఛార్మి

రేపు ఈడీ ముందుకు హీరోయిన్‌ ఛార్మి

డ్రగ్స్ కేసులో రేపు(గురువారం) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఎదుట నటి చార్మి కౌర్ హాజరు కానుంది. ఇప్పటికే చార్మీకి ED నోటీసులు ఇచ్చింది. డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్ ఇచ్చిన సమాచారంతో నోటీసులు జారీ చేశారు. మనీ లాండరింగ్ కోణంలో చార్మి అకౌంట్స్ ను పరిశీలించనున్నారు. కెల్విన్ అకౌంట్లోకి చార్మి పెద్ద మొత్తంలో నగదు బదిలీ చేసిందా అనే కోణంలో చార్మి ప్రొడక్షన్ హౌజ్ ఆర్ధిక లావాదేవిలపై ఆరా తీయనున్నారు. ఎంత కాలంగా కెల్విన్ తో ఛార్మికి పరిచయం డ్రగ్స్ సేవించారా.. కెల్విన్ తో పాటు సరపరాకు కూడా సహకరించారా అనే అంశాలపై విచారించనున్నారు. అసలు ఎన్ని సార్లు ఛార్మి కెల్విన్ అకౌంట్ కు మనీ ట్రాన్స్ ఫర్ చేసింది. అనేక కోణాల్లో ఆధారాలతో కూడిన విచారణ ED చేయనున్నది.

ఇప్పటికే మొదటిరోజైన సోమవారం రోజున డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ను..దాదాపు 10 గంటల పాటు విచారించింది ఈడీ.