ఎస్సీ, ఎస్టీ కమిషన్ మెంబర్స్​ను నియమించండి: హైకోర్టు ఆదేశం

ఎస్సీ, ఎస్టీ కమిషన్ మెంబర్స్​ను నియమించండి: హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌‌‌‌  చైర్మన్, మెంబర్స్‌‌‌‌ను ఆరు వారాల్లోగా నియమించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఎస్సీ, ఎస్టీ సభ్యులను నియమించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందంటూ సికింద్రాబాద్‌‌‌‌కు చెందిన గణేష్‌‌‌‌రావు రిట్​ వేశారు. ఈ రిట్​ను చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ అలోక్‌‌‌‌ అరాధే, జస్టిస్‌‌‌‌ టి.వినోద్‌‌‌‌కుమార్‌‌‌‌లతో కూడిన డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ మంగళవారం విచారించింది. ప్రభుత్వం గడువు కోరడంతో హైకోర్టు ఆరువారాల్లోగా నియమించాలని ఆదేశించింది. అనంతరం విచారణను వచ్చే నెల 15కి వాయిదా వేసింది.