
- ఐదుగురి డెడ్బాడీలు లభ్యం
ఈషిమ్లా: హిమాచల్ప్రదేశ్లో వర్షాలు, ఆకస్మిక వరదలకు ఆరుగురు గల్లంతయ్యారు. వారికోసం పోలీసులు, హోంగార్డులతో కలిసి డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు సహాయ చర్యలు చేపట్టాయి. కాంగ్రా, కులు జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు పడటంతో ఆకస్మిక వరదలు వచ్చాయి. దీంతో ఇందిరా ప్రియదర్శిని జల విద్యుత్ ప్రాజెక్టు సైట్ సమీపంలో ఉంటున్న పలువురు కూలీలు వరదల్లో కొట్టుకుపోగా, ఇప్పటివరకు ఐదు డెడ్బాడీలు లభ్యమయ్యాయి.
శిబిరంలో ఉన్న మొత్తం మందిలో ఐదుగురు కొండ ప్రాంతంవైపు పరిగెత్తి ప్రాణాలు కాపాడుకున్నారు. మిగిలినవారు వరద నీటిలో కొట్టుకుపోయారు. ఇప్పటివరకు ఆరుగురు తప్పిపోయారని, వారికోసం రెస్క్యూ టీమ్స్ వెతుకుతున్నాయని ఆఫీసర్లు తెలిపారు.