
మనదేశంలో ఇల్లు అద్దెకు దొరకడం పెద్దసవాల్..ముఖ్యంగా మెట్రోనగరాల్లో అయితే మరీదారుణం..ఇల్లు మంచిది దొరికితే అద్దె ఎక్కువ..అద్దె తక్కువుంటే వసతులు సరిగా ఉండవు. దీనికి తోడు ఓనర్ల రూల్స్..ఇవన్నీ ఒకవైపు అయితే కులం, మతం, మ్యారేజ్ స్టేటస్, చివరికి తినే తిండి ఆధారంగా పక్షపాతం చూపిస్తున్నారనే రిపోర్టులు లేకపోలేదు. దీంతో టెనెంట్ ఎదుర్కొంటున్న ఇబ్బందులు అంతాఇంతా కాదు.. ఇంటర్నెట్ దృష్టిని ఆకర్షించిన ఇటీవలి ఓ సంఘటన ఈ సమస్యను హైలైట్ చేస్తుంది. చెన్నైకి చెందిన వ్యక్తికి ఇల్లు అద్దెకు ఇచ్చేందుకు యాజమాని పెట్టిన షరతు, మేసేజ్చూసి ఆ వ్యక్తికి దిమ్మతిరిగింది. తనకు ఎదురైన అనుభవాన్ని నెటిజన్లతో షేర్ చేసుకున్నాడు.. వివరాల్లోకి వెళితే..
చెన్నైలో అద్దె ఇంటికోసం వేటలో ఉన్న ఓ వ్యక్తికి వింత,చేదు అనుభవం ఎదురైంది. ఇల్లు అద్దెకు కావాలని వెళ్లిన వ్యక్తి.. ఇంటి ఓనర్ తన వింత డిమాండ్ తో షాకిచ్చాడు. మేం శాఖహారులకు మాత్రమే అద్దెకు ఇస్తాం అని చెప్పడంతో ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. తనకు ఎదురైన అనుభవాన్ని X ప్లాట్ ఫాం ద్వారా నెటిజన్లతో షేర్ చేసుకున్నాడు. ఇంటి ఓనర్ఇచ్చిన మేసేజ్ స్క్రీన్ షాట్అప్లోడ్ చేశాడు. క్షమించండి సార్.. శాఖాహార కుటుంబాలకు మాత్రమే అద్దెకు ఇస్తాం అని అందులో రాసి ఉంది. దీనికి చెన్నైలో అద్దెకు ప్లాట్ లు దొరకడం మాంసాహారం తినడం హానికరం అని పోస్ట్ క్యాప్షన్ ఇచ్చాడు ఆ వ్యక్తి.
ఈ పోస్ట్ షేర్చేసిన వెంటనే అందరి దృష్టిని ఆకర్షించింది. సోషల్ మీడియా యూజర్లు రిప్లైలతో మేసేజ్ బాక్స్నింపేశారు. ప్లాట్అద్దెకు, తినే తిండికి ముడిపెట్టడంపై చాలామంది అసహనం వ్యక్తం చేశారు. మరికొందరు ఇంటి ఓనర్ నిర్ణయాన్ని సమర్ధించారు. కులం లేదా మతం ఆధారంగా కొందరు రెంటుకు ఇస్తారు.. బహుశా వేరే మతానికి అద్దెకు ఇవ్వకుండాఉండేందుకు ఇది పరోక్ష ప్రశ్న అయి ఉండొచ్చని నెటిజన్లు రాశారు.
వారిలో ఓ నెటిజన్ స్పందిస్తూ.. కొందరు 'జైనులకు మాత్రమే' అంటారు.. మరికొందరు తెలుగువారికి మాత్రమే అని కూడా అంటారు.మరో నెటిజన్ స్పందిస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారి ఇండ్లగోడలు ఏమైనా శాఖాహారుల చేత నిర్మాణం చేశారా అని ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు నాన్-వెజ్ తింటారు.తినాలనుకునే వారు చాలా ఆనందంగా తింటారు..వారు ఇంట్లో వండుకుంటారు ,వారిని ఎవరు ఆపుతున్నారు.. కానీ ఎవరూ ఎవరిపైనా నాన్-వెజ్ తినమని ఒత్తిడి చేయలేరు" అని ఇంకో నెటిజన్ రాశారు.
కొంతమంది నెటిజన్లు ఇంటి ఓనర్ నిర్ణయాన్ని సమర్ధించారు. అతని ఆస్తి అతని ఇష్టం..అతను నకిలీల దౌర్జన్యంతో విసిగిపోయి ఉంటాడు. అని రాశాడు. శాఖాహార టెనెంట్ ను కోరుకోవడం కులతత్వం లాంటిది కాదు. బ్రాహ్మణ వాదం కాదు.. అది వ్యక్తిగత ప్రాధాన్యత అని సమర్ధించారు.
గతంలో బెంగళూరు సిటీలోనే ఇంటర్లో 75 శాతం మార్కులు మాత్రమే సాధించినందుకు ఇంటి యజమాని అపార్ట్మెంట్ అద్దెకు ఇచ్చేందుకు నిరాకరించిన సంఘటన జరిగింది. ఇదొక్కటే కాదు.. ఇలాంటివి చాలా సంఘటనలు జరిగాయి. ఏది ఏమైనా హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, చెన్పై లాంటి నగరాల్లో ఇల్లు అద్దెకు దొరకడం కత్తిమీద సామే..