నాన్​ వెజ్టేరియన్స్కు అద్దెకు ఇవ్వం..ఇంటి యజమాని నిర్ణయంపై ఆన్‌లైన్‌లో చర్చ

నాన్​ వెజ్టేరియన్స్కు అద్దెకు ఇవ్వం..ఇంటి యజమాని నిర్ణయంపై ఆన్‌లైన్‌లో చర్చ

మనదేశంలో ఇల్లు అద్దెకు దొరకడం పెద్దసవాల్..ముఖ్యంగా మెట్రోనగరాల్లో అయితే మరీదారుణం..ఇల్లు మంచిది దొరికితే అద్దె ఎక్కువ..అద్దె తక్కువుంటే వసతులు సరిగా ఉండవు. దీనికి తోడు ఓనర్ల రూల్స్​..ఇవన్నీ ఒకవైపు అయితే కులం, మతం, మ్యారేజ్​ స్టేటస్, చివరికి తినే తిండి ఆధారంగా పక్షపాతం చూపిస్తున్నారనే రిపోర్టులు లేకపోలేదు. దీంతో టెనెంట్ ఎదుర్కొంటున్న ఇబ్బందులు అంతాఇంతా కాదు.. ఇంటర్నెట్ దృష్టిని ఆకర్షించిన ఇటీవలి ఓ సంఘటన ఈ సమస్యను హైలైట్ చేస్తుంది. చెన్నైకి చెందిన వ్యక్తికి  ఇల్లు అద్దెకు ఇచ్చేందుకు యాజమాని పెట్టిన షరతు, మేసేజ్​చూసి ఆ వ్యక్తికి దిమ్మతిరిగింది. తనకు  ఎదురైన అనుభవాన్ని నెటిజన్లతో షేర్​ చేసుకున్నాడు.. వివరాల్లోకి వెళితే..

చెన్నైలో అద్దె ఇంటికోసం వేటలో ఉన్న ఓ వ్యక్తికి వింత,చేదు అనుభవం ఎదురైంది. ఇల్లు అద్దెకు కావాలని వెళ్లిన వ్యక్తి.. ఇంటి ఓనర్ తన వింత డిమాండ్ తో షాకిచ్చాడు. మేం శాఖహారులకు మాత్రమే అద్దెకు ఇస్తాం అని చెప్పడంతో ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. తనకు ఎదురైన అనుభవాన్ని X ప్లాట్​ ఫాం ద్వారా నెటిజన్లతో షేర్​ చేసుకున్నాడు. ఇంటి ఓనర్​ఇచ్చిన మేసేజ్​ స్క్రీన్ షాట్​అప్​లోడ్​ చేశాడు. క్షమించండి సార్​.. శాఖాహార కుటుంబాలకు మాత్రమే అద్దెకు ఇస్తాం అని అందులో రాసి ఉంది.  దీనికి చెన్నైలో అద్దెకు ప్లాట్​ లు దొరకడం మాంసాహారం తినడం హానికరం అని పోస్ట్​ క్యాప్షన్​ ఇచ్చాడు ఆ వ్యక్తి. 

ఈ పోస్ట్ షేర్​చేసిన వెంటనే అందరి దృష్టిని ఆకర్షించింది.  సోషల్ మీడియా యూజర్లు రిప్లైలతో మేసేజ్​ బాక్స్​నింపేశారు. ప్లాట్​అద్దెకు, తినే తిండికి ముడిపెట్టడంపై చాలామంది అసహనం వ్యక్తం చేశారు. మరికొందరు ఇంటి ఓనర్​ నిర్ణయాన్ని సమర్ధించారు. కులం లేదా మతం ఆధారంగా కొందరు రెంటుకు ఇస్తారు.. బహుశా వేరే మతానికి అద్దెకు ఇవ్వకుండాఉండేందుకు ఇది పరోక్ష ప్రశ్న అయి ఉండొచ్చని నెటిజన్లు రాశారు. 

వారిలో ఓ నెటిజన్​ స్పందిస్తూ.. కొందరు 'జైనులకు మాత్రమే' అంటారు.. మరికొందరు తెలుగువారికి మాత్రమే అని కూడా అంటారు.మరో నెటిజన్​ స్పందిస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారి ఇండ్లగోడలు ఏమైనా శాఖాహారుల చేత నిర్మాణం చేశారా అని ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు నాన్-వెజ్ తింటారు.తినాలనుకునే వారు చాలా ఆనందంగా తింటారు..వారు ఇంట్లో వండుకుంటారు ,వారిని ఎవరు ఆపుతున్నారు.. కానీ ఎవరూ ఎవరిపైనా నాన్-వెజ్ తినమని ఒత్తిడి చేయలేరు" అని ఇంకో నెటిజన్​ రాశారు. 

కొంతమంది నెటిజన్లు ఇంటి ఓనర్​ నిర్ణయాన్ని సమర్ధించారు. అతని ఆస్తి అతని ఇష్టం..అతను నకిలీల దౌర్జన్యంతో విసిగిపోయి ఉంటాడు. అని రాశాడు. శాఖాహార టెనెంట్​ ను కోరుకోవడం కులతత్వం లాంటిది కాదు. బ్రాహ్మణ వాదం కాదు.. అది వ్యక్తిగత ప్రాధాన్యత అని సమర్ధించారు. 

గతంలో బెంగళూరు సిటీలోనే ఇంటర్​లో 75 శాతం మార్కులు మాత్రమే సాధించినందుకు ఇంటి యజమాని అపార్ట్‌మెంట్ అద్దెకు ఇచ్చేందుకు నిరాకరించిన సంఘటన జరిగింది. ఇదొక్కటే కాదు.. ఇలాంటివి చాలా సంఘటనలు జరిగాయి. ఏది ఏమైనా హైదరాబాద్​, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, చెన్పై లాంటి నగరాల్లో ఇల్లు అద్దెకు దొరకడం కత్తిమీద సామే..