హోటల్ సిబ్బందికి కస్టమ్స్ కి మధ్య గొడవలు జరగడం వెరీ కామన్ అవుతుంది. హోటల్ కి వెళ్లామా ఫుడ్ తిన్నామా కాసేపు హోటల్ యజమానితో గొడవ పెట్టుకున్నామా తన్నులు తిన్నామా ఆస్పత్రిలో చేరామా అన్నట్టు కాలం నడుస్తుంది. అవును మరి కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లోని పలు హోటల్ లో బిర్యానీ తిందామని వెళ్తే హోటల్ సిబ్బంది కస్టమర్ల పై దాడి చేసి తల పగలగొట్టిన సంగతి మరవకముందే మరో చోట కత్తి పోట్లు కలకలం రేపాయి.
ఢిల్లీలోని ఫార్ష్ బజార్ ప్రాంతంలోని భికం సింగ్ కాలనీలోని ఓ మోమోస్ షాప్ కి కస్టమర్ వెళ్లి మోమోస్ తీసుకొని తింటుండగా చట్నీ అయిపోయింది. కొంచెం చట్నీ వేయవా అన్నా అని అడిగితే యజమాని కొంచెం కోపగించుకున్నాడు. దీంతో ఇరువురు వాగ్వాదానికి దిగారు. యజమానికి చిర్రెత్తుకొచ్చి కస్టమర్ పై కత్తితో దాడి చేశాడు. దీంతో కస్టమర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ రోడ్డు పై రక్తం పడటంతో భయబ్రాంతులకు గురైన సదరు కస్టమర్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
दिल्ली मे मोमोज़ की चटनी मांगने को लेकर हो गई चाकूबाजी
— Lavely Bakshi (@lavelybakshi) January 10, 2024
एक व्यक्ति हुआ घायल उपचार के लिए GTV हॉस्पिटल भर्ती कराया गया थाना फ़र्श बाजार इलाके में भीकम सिंह कालोनी, मे हुई है वारदात@DelhiPolice @CPDelhi pic.twitter.com/VT4QcgrRVp
గొడవ పై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కస్టమర్ ను జీవీటీ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన బాధితుడు చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేశామని విచారణ చేపడతామని చెప్పారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. రక్తపు మరకలను వీడియో తీసి ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇంకేముంది క్షణాల్లోనే వైరల్ అయ్యింది. ఏంటి చట్నీ అడిగితే కత్తితో పొడుస్తారా అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.