సాగర్ తీరంలో రూ.100 కోట్లతో అంబేద్కర్ విగ్రహం

సాగర్ తీరంలో రూ.100 కోట్లతో అంబేద్కర్ విగ్రహం

రాష్ట్రంలోని దళితులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న తెలంగాణ ప్రభుత్వం  లేటెస్టుగా  మరో కీలక ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతోంది. హైదరాబాదు నగరంలోని హుస్సేన్ సాగర్ తీరంలో రూ.100 కోట్లతో అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ విగ్రహం ఎత్తు 125 అడుగులు. దీనికోసం రూ.100 కోట్లకు టెండర్లు పిలవాలని TRS  ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ విగ్రహం కింది భాగంలో 50 అడుగుల వరకు పార్లమెంటు ఆకృతిలో ఓ భవంతి ఉంటుందని.. దానిపైన విగ్రహ నిర్మాణం ఉంటుందని తెలిపారు మంత్రి కొప్పుల ఈశ్వర్ . 15 నెలల కాలంలో ఈ విగ్రహం నిర్మాణం పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అంబేద్కర్ గొప్పదనాన్ని ప్రతిబింబించేలా విగ్రహ నిర్మాణం ఉంటుందన్నారు.