బీ కేర్ ఫుల్.. ఫేక్ పేమెంట్ యాప్స్ తో మోసపోవద్దు

బీ కేర్ ఫుల్.. ఫేక్ పేమెంట్ యాప్స్ తో మోసపోవద్దు

హైదరాబాద్: సైబర్ నేరాల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్. బుధ‌వారం బ‌షీర్ బాగ్ సీపీ కార్యాల‌యంలో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. ఫేక్ పేటీఎం, గూగుల్ పే పేమెంట్ యాప్స్ తో మోసాలకు పాల్పడుతున్న ఎనిమిది మందిని అరెస్ట్ చేశామన్నారు. కేవైసీ ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకోవాలని సూచించారు. ఫోన్ లో కూడా పేటిఎంకు లెటర్స్, నెంబర్స్ గల స్ట్రాంగ్ పాస్ వర్డ్ పెట్టుకోవాలన్నారు. ట్రాన్సక్షన్లు చేసే వెబ్ సైట్ అసలైనదో నకిలీదో తెలుసుకోవాలని.. క్రెడిట్, డెబిట్ కార్డులు పోతే వెంటనే బ్లాక్ చేసుకోవాలన్నారు.