బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే... చర్చకు ఎక్కడికైనా సిద్ధం : ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే...  చర్చకు ఎక్కడికైనా  సిద్ధం :  ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

రిజర్వేషన్లకు సంబంధించిన ఒక వీడియోపై నిన్న ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్ కు వచ్చి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.  అయితే  లీగల్ నోటీసులను న్యాయపరంగా ఎదుర్కోడానికి సిద్ధమైంది కాంగ్రెస్. ఢిల్లీ పోలీసుల నోటీసులకు భయపడేది లేదన్నారు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్.  నోటీసులకు ధీటైన సమాధానం ఇస్తామన్నారు.  కాంగ్రెస్ పార్టీ మార్ఫింగ్ వీడియోలు చేయలేదని..  మార్ఫింగ్ లో బీజేపీ ప్రపంచంలో నే దిట్టని విమర్శించారు.  

రిజర్వేషన్లు అంబేద్కర్ ఇచ్చిన హక్కు అని..రిజర్వేషన్లు కొనసాగాలంటే కాంగ్రెస్ కు ఓటు వేయాలని పిలుపునిచ్చారు.  కాంగ్రెస్ కు గ్రాఫ్ పెరుగుతుందనే బీజేపీనే ఫేక్ వీడియోల కుట్రకు దిగిందని ఆరోపించారు.  బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని..  ఆ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం కొనసాగుతోందన్నారు.  ఈ విషయంలో ఎక్కడైనా చర్చకు సిద్ధమని మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు.  లోక్ సభ ఎన్నికల్లో 14  ఎంపీ స్థానాల్లో గెలుస్తామని..  రాష్ట్రంలో కేసీఆర్ శకం ఇక ముగిసినట్టేనని చెప్పారు. 

Also Read:కేసీఆర్ నోరు తెరిస్తే అబద్దమే: భట్టి విక్రమార్క ఫైర్