
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) కొత్త సీజన్కు రంగం సిద్ధమైంది. గురువారం నుంచి ఎ1 డివిజన్ లీగ్ మ్యాచ్లు జరుగుతాయని హెచ్సీఏ జాయింట్ సెక్రటరీ బసవరాజు ప్రకటించారు. ఈసారి ఫార్మాట్లో కీలక మార్పులు చేశారు. ఈ సీజన్లో 3డే లీగ్ మ్యాచ్లు నిర్వహించడం లేదు. రెండ్రోజుల మ్యాచ్లు మాత్రమే నిర్వహించనున్నారు. ఇందులో 22 జట్లను మూడు పూల్స్గా విభజించారు. ప్రతి జట్టు తమ పూల్లోని మిగిలిన జట్లతో ఒక్కో మ్యాచ్లో తలపడుతుంది.
గత సీజన్లో ఎ1 డివిజన్ లీగ్ మ్యాచ్లు జరగకపోవడంతో 2023–-24 సీజన్ స్థానాలు, ప్రమోషన్/రిలీగేషన్ ఆధారంగా 22 జట్లు కొత్త సీజన్లో కొనసాగుతాయి. లీగ్ దశ తర్వాత ప్రతి పూల్ నుంచి రెండేసి చొప్పున మొత్తం ఆరు జట్లు చాంపియన్షిప్ ప్లే-ఆఫ్స్కు అర్హత సాధిస్తాయి. ఈ ప్లే-ఆఫ్స్ను 4డే మ్యాచ్లుగా నిర్వహిస్తారు. ఈ రౌండ్లో ఒక్కో జట్టు ఐదు మ్యాచ్లు ఆడుతుంది. టాప్–2లో నిలిచే టీమ్స్ ఫైనల్లో తలపడతాయి. 2025–26 సీజన్కు సంబంధించిన సబ్స్క్రిప్షన్ ఫీజులను చెల్లించని క్లబ్స్, ఇన్స్టిట్యూషన్స్ను లీగ్ మ్యాచ్ల్లోపాల్గొనడానికి అనుమతించబోమనిబసవరాజు తెలిపారు.