హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి గుడ్ న్యూస్ తెలిపారు. హైదరాబాద్ మెట్రో సర్వీస్ల సమయాన్ని పొడిగించినట్లు ప్రకటించారు. ఇకపై రాత్రి 11గంటల వరకు మెట్రో రైళ్లు నడవనున్నాయి. ఈ నెల 10 నుంచి ప్రయాణికులకు ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

ప్రస్తుతం చివరి ట్రైన్ 10.15 గంటల వరకే ప్రయాణికులకు అందుబాటులో ఉంది. ఎప్పటిలాగే ఉదయం 6 గంటలకే మెట్రో సేవలు ప్రారంభంకానున్నాయి. అయితే ఏదైన ప్రత్యేక సమయాల్లో మాత్రం మెట్రోను అర్ధరాత్రి వరకు నడుపుతున్నారు. ప్రస్తుతం మరో గంటపాటు టైమింగ్ ను పొడగించడంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.