హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో కారు బీభత్సం సృష్టించింది. రెండు బైకులను ఢీ కొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. దీంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఓ బైకుపై అన్నా చెల్లెల్లు..మరో వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని పోలీసులు మాదాపూర్ మెడికవర్ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతానికి ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
కృష్ణా కృష్ణానగర్ కి చెందిన అన్నా చెల్లెల్లు ఉదయ్ , స్వీటీ కలిసి ద్విచక్ర వాహనం మీద కలిసి వెళ్తున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36 సెంట్రో గ్రాండీ దగ్గరకు రాగానే.. పక్కనే వేరొక బైక్ పై వెళ్తున్న మరొక వ్యక్తిని.. వెనుక నుంచి వచ్చిన వైట్ కలర్ స్పోర్ట్స్ కార్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ హెల్మెట్ కార్ కి వేలాడుతున్నా పట్టించుకోకుండా వెళ్లిపోయింది కారు. దీంతో రెండు బైకులపై వెళ్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవలే జూబ్లీహిల్స్ పరిధిలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని కారు ఢీ కొట్టగా స్పాట్ లో చనిపోయాడు. తర్వాత సీసీ పుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితుడిని పట్టుకున్న సంగతి తెలిసిందే..