ఓల్డ్సిటీ, వెలుగు: న్యూఇయర్ వేడుకల్లో ప్రమాదాలు జరగకుండా సౌత్ జోన్, సౌత్ ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్లో ముగ్గురు ఏసీపీలు, 12 మంది సీఐలు, 1,500 మంది కానిస్టేబుళ్లతో క్రాక్ డౌన్, రాంగ్ రూట్ ట్రాఫిక్ ఉల్లంఘనలపై ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ 111 డీసీపీ ఆర్. వెంకటేశ్వరులు వెల్లడించారు. శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. న్యూఇయర్ వేళ డ్రంక్ అండ్ డ్రైవ్కు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వెక్కిలి చేష్టలతో రోడ్లపై అల్లరి తిరుగుళ్లు తిరగకుండా సురక్షితమైన డ్రైవింగ్ చేయాలని సూచించారు.
