రూ.66.63 కోట్లతో నిర్మించిన బాచుపల్లి ఫ్లైఓవర్‌ అందుబాటులోకి..

రూ.66.63 కోట్లతో నిర్మించిన బాచుపల్లి ఫ్లైఓవర్‌ అందుబాటులోకి..

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి ట్రాఫిక్ రద్దీ లేని ప్రయాణం కోసం రూ.66.63 కోట్లతో నిర్మించిన బాచుపల్లి ఫ్లైఓవర్‌ను ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి జూన్ 8న 1.3 కిలోమీటర్ల, 4 లేన్ల బాచుపల్లి ఫ్లైఓవర్‌ను ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ మియాపూర్, నిజాంపేట్, మల్లంపేట్, బోరంపేట్ మధ్య సులువైన, సిగ్నల్- రహిత అనుసంధానాన్ని అందించి, ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికుల ట్రాఫిక్‌ తిప్పలను తగ్గిస్తుంది.

సిటీలోని సాఫ్ట్వేర్​కంపెనీల్లో 90 శాతం కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్​ ఏరియాల్లోనే ఉన్నాయి. బాచుపల్లి, ఐడీఏ బొల్లారం, మియాపూర్​, చందానగర్​, హఫీజ్​పేట, రాఘవేంద్రకాలనీ,  మైత్రి నగర్, జనప్రియనగర్​, అల్విన్​కాలనీ, మదీనాగూడ, దీప్తిశ్రీనగర్​ ఏరియాల్లో ఉండే ఐటీ, ఇతర ఉద్యోగులు గచ్చిబౌలి, మాదాపూర్​, కొండాపూర్కు ఉద్యోగ నిమిత్తం రాకపోకలు సాగిస్తుంటారు. ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి రావడం వల్ల ఐటీ ఈ చుట్టుపక్కల ఉండే ఉద్యోగులకు కూడా కొంత మేలు జరిగినట్లయింది.