హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి ట్రాఫిక్ రద్దీ లేని ప్రయాణం కోసం రూ.66.63 కోట్లతో నిర్మించిన బాచుపల్లి ఫ్లైఓవర్ను ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి జూన్ 8న 1.3 కిలోమీటర్ల, 4 లేన్ల బాచుపల్లి ఫ్లైఓవర్ను ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ మియాపూర్, నిజాంపేట్, మల్లంపేట్, బోరంపేట్ మధ్య సులువైన, సిగ్నల్- రహిత అనుసంధానాన్ని అందించి, ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికుల ట్రాఫిక్ తిప్పలను తగ్గిస్తుంది.
సీఎం రేవంత్ రెడ్డి గారు ట్రాఫిక్ రద్దీ లేని ప్రయాణం కోసం రూ.66.63 కోట్లతో నిర్మించిన బాచుపల్లి ఫ్లైఓవర్ను ప్రారంభించారు. pic.twitter.com/XUPxdJaO5V
— TG Govt Updates (@TGGovtUpdates) June 8, 2026
సిటీలోని సాఫ్ట్వేర్కంపెనీల్లో 90 శాతం కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్ ఏరియాల్లోనే ఉన్నాయి. బాచుపల్లి, ఐడీఏ బొల్లారం, మియాపూర్, చందానగర్, హఫీజ్పేట, రాఘవేంద్రకాలనీ, మైత్రి నగర్, జనప్రియనగర్, అల్విన్కాలనీ, మదీనాగూడ, దీప్తిశ్రీనగర్ ఏరియాల్లో ఉండే ఐటీ, ఇతర ఉద్యోగులు గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్కు ఉద్యోగ నిమిత్తం రాకపోకలు సాగిస్తుంటారు. ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి రావడం వల్ల ఐటీ ఈ చుట్టుపక్కల ఉండే ఉద్యోగులకు కూడా కొంత మేలు జరిగినట్లయింది.
Big boost for North-West Hyderabad!
— Telangana Rising 2047 (@TGRising2047) June 6, 2026
Chief Minister A. Revanth Reddy will inaugurate the 1.3 km, 4-lane Bachupally Flyover on June 8.
The project will provide smoother, signal-free connectivity between Miyapur, Nizampet, Mallampet & Bowrampet, easing traffic for thousands of… https://t.co/CDfbhM0qsC pic.twitter.com/MbI0Olmuv3
