
- గతంలో ఇద్దరం టీడీపీలోనే ఉన్నాం
త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. ఇద్దరం గతంలో టీడీపీలోనే ఉన్నామని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రమాణస్వీకరానికి అసెంబ్లీకి వచ్చిన మల్లారెడ్డి... మీడియాతో చిట్ చాట్ చేశారు. అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిస్తే తప్పేముందని ప్రశ్నించారు. చర్చకు తావులేకుండా కలిసే ముందు..మీడియాకు సమాచారం అందిస్తున్నానన్నారు.
బీఆర్ఎస్ ఓడిపోతుందని..కాంగ్రెస్ గెలుస్తుందని కలలో కూడా అనుకోలేదని మల్లారెడ్డి అన్నారు. తాను ఇంకా షాక్ బయటకు రాలేదని చెప్పారు. మల్కాజ్ గిరి ఎంపీగా తననే పోటీ చేయాలని పార్టీ కోరినట్లు చెప్పారు. తన కొడుకు భద్రారెడ్డికి టికెట్ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నానని మల్లారెడ్డి అన్నారు.