వాయుసేనలో "అగ్నిపథ్" రిజిస్ట్రేషన్లు షురూ..

వాయుసేనలో "అగ్నిపథ్" రిజిస్ట్రేషన్లు షురూ..

అగ్నిపథ్ పథకం కింద వాయు సేనలో నియామకాల కోసం ఇటీవల వెలువడిన ప్రకటనకు నేటి నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. అగ్నివీర్ వాయు ద్వారా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైందని ఐఏఎఫ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు agnipathvayu.cdac.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఇక ఈ ప్రక్రియ జులై 5న ముగుస్తుందని, అగ్నిపథ్ కు అవసరమైన నిబంధనలన్నీ అభ్యర్థులు పాటించాలని పేర్కొంది. అంతే కాదు అభ్యర్థులు దరఖాస్తు చేసిన నకలు కాపీలను తమ వద్ద ఉంచుకోవాలని సూచించింది. కాగా అగ్నివీర్ తొలి బ్యాచ్ ను 2022 డిసెంబర్ 11నాటికి ప్రకటిస్తామని ఇటీవలే అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ అగ్నిపథ్ అంశంపై సర్వత్రా వ్యతిరేకత ఏర్పడగా... దేశంలోని పలు చోట్ల ఆందోళనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే అగ్నివీరుల నియామకాల కోసం భారత సైన్యం నోటిఫికేషన్ ను జారీ చేసిన విషయం కూడా తెలిసిందే.