దాడి చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవు: రాజ్‌నాథ్

దాడి చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవు: రాజ్‌నాథ్

న్యూఢిల్లీ: లడఖ్‌ సెక్టార్‌‌లోని బార్డర్‌‌లో చైనాతో సరిహద్దు ఉద్రికత్తతలు తగ్గడం లేదు. దీనిపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. దేశ సైనికుల తనకు మీద పూర్తి నమ్మకం ఉందన్నారు. ఇండియా భూభాగంలో ఎవరూ ఒక్క ఇంచు భూమినీ ఆక్రమించలేరన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రేడియోలో సైనికుల గురించి రాజ్‌నాత్ పలు విషయాలు మాట్లాడారు. సైనికుల ధైర్య, సాహసాల వల్లే దేశం సురక్షితంగా ఉందన్నారు. నిస్వార్థంగా సేవలందిస్తున్న సైనికులకు రాజ్‌నాత్ చేశారు. దేశంపై ఎవరైనా డేర్ చేసి అటాక్ చేస్తే మాత్రం గతంలో లాగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. లడఖ్ సరిహద్దుల్లో ఇండియా, చైనాలు దాదాపు లక్ష మంది సైనికులను మోహరించాయని సమాచారం. దీంతో బార్డర్‌‌లో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

‘నేషనల్ సెక్యూరిటీలో భాగంగా మేం ఏం చేసినా అది ఆత్మ రక్షణ కోసమే తప్ప ఇతరులపై దాడి చేయడానికి కాదు. ఒకవేళ శత్రు దేశం ఎప్పటిలాగే అటాక్ చేస్తే మాత్రం మేం దీటుగా బదులిస్తాం. ఇండియా ఏ దేశంపై కూడా దాడి చేయలేదని, అలాగే ఏ దేశం కూడా భారత్‌ను ఆక్రమించుకోలేదని హిస్టరీ చెబుతోంది. అయితే దీనర్థం.. మా సెల్ప్​ రెస్పెక్ట్‌కు భంగం కలిగిస్తే ఊరుకుంటామని కాదు. దేశాన్ని కాపాడిన వీర సైనికుల త్యాగాలను ప్రజలు ఎప్పటికీ మరువబోరు. వాళ్ల కుటుంబాలు ఒంటరి కావు. దేశం మొత్తం వాళ్లకు అండగా ఉంటుంది’ అని రాజ్‌నాథ్ వివరించారు.