పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ అయోధ్యలో ఆదివారం రోడ్ షో నిర్వహించారు. అయోధ్యలోని సుగ్రీవ కోట నుంచి లతా చౌక్ వరకు మోదీ 2 కిలోమీటర్ల మేరా రోడ్షో చేశారు.
అంతకు ముందు ఆయన అయోధ్య రామమందిరాన్ని దర్శించుకున్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యానాథ్ తో కలిసి రామ్ బాల రామునికి పూజలు చేశారు. జనవరి 22న అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ తర్వాత మోదీ మళ్లీ అయోధ్య రావడం ఇదే మొదటి సారి. ఉత్తరప్రదేశ్ లో 5వ దశలో వారణాసి నియోజకవర్గంలో లోక్ సభ ఎలక్షన్ జరగనున్నాయి.
ఆదివారం సాయంత్రం ఇవాళ ప్రధాని మోదీ రామాలయ సందర్శన నేపథ్యంలో అయోధ్యలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధాని మోదీ మే 14న నామినేషన్ దాఖలు చేయనున్నారు. దానికంటే ఒకరోజు ముందు మే 13న ఆ నియోజకవర్గంలో భారీ రోడ్ షో నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ వారణాసి నుంచి ఎన్నికల్లో పోటీ చేయడం ఇది మూడోసారి. ప్రధాని 2014లో తొలిసారి వారణాసి నుంచి ఎంపీ అయ్యారు.
#WATCH | Prime Minister Narendra Modi's roadshow underway in Ayodhya, Uttar Pradesh.
— ANI (@ANI) May 5, 2024
CM Yogi Adityanath is also present. #LokSabhaElections2024 pic.twitter.com/SYWpmszZzh