2028లో బీజేపీ పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది : వెంకటరమణా రెడ్డి

2028లో బీజేపీ పార్టీ తెలంగాణలో  ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది : వెంకటరమణా రెడ్డి

 2028లో జగిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి అన్నారు. విజయ సంకల్పయాత్రలో భాగంగా గురువారం రోజు నకిరేకల్, మునుగోడు నియోజకవర్గాల్లో విజయ సంకల్ప సభలు నిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణలో 11 ఎంపీ స్థానాలు గెలుచుకుంటామని అన్నారు. రాజకీయ నాయకుల మాటలు చూసి రొచ్చు డైలాగులు అని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. 

కాంగ్రెస్ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పగిలిన డ్యాములు కట్టి, ఉద్యోగాలు ఇవ్వక నిరుద్యోగులను మోసం చేసిందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఏమీ లేదని అన్నారు.

 కాంగ్రెస్ మేనిఫెస్టోను అమలు చేయలేకనే రాష్ట్రం అప్పులపాలు అయిందని చెబుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ రద్దయిన నోటు లాంటిదన్నారు. మోడీ ప్రవేశపెట్టిన వికసిత భారత ద్వారా ఇతర దేశాల నుండి మన దేశానికి స్వదేశీయులు వస్తున్నారు