యుద్ధ నౌకల్లో తొలిసారిగా మహిళా అధికారుల నియామకం

యుద్ధ నౌకల్లో తొలిసారిగా మహిళా అధికారుల నియామకం

భారత నౌకాదళంలో మొదటి సారి మహిళా అధికారులుగా సబ్‌ లెఫ్టినెంట్లు కుముదిని త్యాగి, రితిసింగ్‌లు అడుగుపెట్టనున్నారు. భారత నౌకా దళంలో పలు ర్యాంకుల్లో ఎంతోమంది మహిళా అధికారులున్నా… యుద్ధనౌకల్లో వీరి నియామకం ఇది ఫస్ట్ టైం. ఎక్కువ సమయం పనిచేయాల్సి ఉండటం, సిబ్బంది క్వార్టర్లలో ప్రైవసీ ఇబ్బందులు, మహిళలు, పురుషులకు ప్రత్యేక బాత్‌రూంల కొరత వంటి పలు కారణాలతో ఇప్పటి వరకూ యుద్ధ నౌకల్లో మహిళా అధికారులను తీసుకోలేదు.

కుముదిని త్యాగి, రితిసింగ్‌లిద్దరు మహిళా అధికారులు వివిధ అంశాల్లో శిక్షణ పొందారు. నౌకాదళం​ అమ్ములపొదిలో చేరనున్న అత్యాధునిక MH-60R హెలికాఫ్టర్లలో వీరు విధులు నిర్వహిస్తారని భావిస్తున్నారు.