ఓటుకు నోటు’ కేసు విచారణ జులైకి వాయిదా : సుప్రీంకోర్టు

ఓటుకు నోటు’ కేసు విచారణ జులైకి వాయిదా : సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, వెలుగు: ఓటుకు నోటు కేసు విచారణను సుప్రీంకోర్టు జులైకి వాయిదా వేసింది. ఈ అంశంలో దాఖలైన రెండు కేసుల విచారణను మధ్యప్రదేశ్ కు బదిలీ చేయాలని ఈఏడాది జనవరి 31న బీఆర్ఎస్ నేతలు జగదీశ్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను శుక్రవారం జస్టిస్ బీఆర్ గవాయీ, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన బెంచ్​ విచారించింది. 

పిటిషనర్, ప్రతివాదుల తరపున అడ్వకేట్లు ఒకరినొకరు టార్గెట్ గా వాదనలు కొనసాగించడంతో జస్టిస్ బీఆర్ గవాయీ అసహనం వ్యక్తం చేశారు. దీంతో అడ్వకేట్లు బెంచ్ కు క్షమాపణ చెప్పారు.