200 కోట్ల మందికి అందని మంచి నీరు.. ఆ దేశాల్లో ఎక్కువగా సమస్య..

200 కోట్ల మందికి అందని మంచి నీరు.. ఆ దేశాల్లో ఎక్కువగా సమస్య..

రోజు మెుదలవ్వాలంటే ఎవరికైనా నీరు కావాల్సిందే. మనం లేవగానే చల్లటి మంటినీటితో రోజును స్టార్ట్ చేస్తాం. చాలా మంది ఇళ్లలో సురక్షితమైన మంచినీరు త్రాగటానికి అందుబాటులో ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది కూడా ఇదే సౌకర్యాలను కలిగి ఉన్నారు. అయితే ప్రస్తుతం ఉన్న ఆధునిక ప్రపంచంలో కూడా దాదాపు 200 కోట్ల మంది ఇప్పటికీ శుద్ధమైన తాగునీటికి దూరంగానే గడుపుతున్నారనే వార్త నిజంగా కలిచివేస్తోంది. అయితే వీరందరూ శుభ్రమైన మంచినీరు దొరకకుంటే ఎలా గడుపుతున్నారు అనే ప్రశ్న అందరికీ ఉంటుంది. 

ప్రజలు సురక్షితమైన త్రాగునీరు పొందుతున్నారని భావించాలంటే.. ముందుగా అది మూడు ప్రమాణాలకు లోబడి ఉండాలి. ఆ నీరు ఇంటికి దగ్గరలో ఉండాలి, అవసరమైనప్పుడు అందుబాటులో ఉండాలి. ఇక అన్నింటి కంటే ముఖ్యమేనది ఆ నీరు కలుషితం కాకుండా ఉండాలి. ప్రస్తుతం ఇలాంటి సౌకర్యం ప్రపంచ వ్యాప్తంగా 600 కోట్ల మందికి అందుబాటులో ఉందని నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం మంచి నీరు ప్రపంచ వ్యాప్తంగా రెండు మార్గాల్లో లభిస్తోంది. ఒకటి పైపుల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా కాగా రెండవది దగ్గరిలోని నది నుంచి నీటిని తెచ్చుకోవటం. 

►ALSO READ | Big Breaking Alert : వెంటనే మీ పాస్‌వర్డ్స్ అన్నీ మార్చేసుకోండి.. గూగుల్, FB వంటివి ఏవైనా సరే..

అయితే ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల మంది ఇప్పటికీ పైపుల ద్వారా రక్షిత మంచినీటిని పొందలేకపోతున్నారని నివేదించబడింది. అయితే పైపుల ద్వారా సరఫరా చేసే నీరు చాలా దూరం నుంచి వస్తున్నందున ఈ మధ్యలో అవి ఎక్కడా కలుషితం కావటం లేదనే గ్యారెంటీ లేని పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం సురక్షితమైన మంచినీరు అభివృద్ధిలో కీలక సూచికగా పరిగణించబడుతోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నీటి సరఫరా 95 శాతం మెరుగుపడింది. పేద దేశాల్లో కూడా నీటి పంపిణీ వ్యవస్థలు గడచిన దశాబ్ధకాలంలో వేగంగా పెరిగాయి. 

అయితే కలుషితమైన నీరు తాగటం వల్ల ఏటా 8 లక్షల మంది మరణిస్తున్నారని తేలింది. కలరా, డయేరియా వంటి రోగాల వ్యాప్తితో పాటు పోలియో, హెపటైటిస్ వంటి రోగాలు మరణాలకు కారణం అవుతున్నాయని తేలింది. కొన్ని చోట్ల నీటి కొరత ప్రజల్లో పోషకాహార లేమికి దారితీస్తోందని వెల్లడైంది. తక్కువ ఆదాయం కలిగిన దేశాల్లో ఈ సమస్య అధికంగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.