నితీష్ ను మర్యాదపూర్వకంగానే కలిశానన్న పీకే

 నితీష్ ను మర్యాదపూర్వకంగానే కలిశానన్న పీకే

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు.మొన్నటి వరకు బిహార్ సీఎం నితీష్ కుమార్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గమనేది. వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో జేడీయూ నుంచి ప్రశాంత్ కిషోర్ ను తొలగించారు నితీష్ కుమార్. జేడీయూలో నెంబర్ 2గా ఉన్న ప్రశాంత్ కిషోర్ ను తొలగించడం అప్పట్లో సంచలనంగా మారింది. వీరిద్దరూ మళ్లీ కలవరనే అనుకున్నారు అందరూ. కానీ అనూహ్యంగా వీరిద్దరూ ఢిల్లీలోని బిహార్ సీఎం నితీష్ కుమార్ ఇంట్లో దాదాపు రెండు గంటలపాటు సమావేశమయ్యారు. అంతేకాదు ఇద్దరూ కలిసి భోజనం కూడా చేశారు. ప్రశాంత్ కిషోర్ తో భేటీకి సంబంధించిన విషయాన్ని నితీష్ కుమార్ ధృవీకరించారు. అయితే ప్రశాంత్ కిషోర్ మాత్రం నితీష్ కుమార్ ను మర్యాదపూర్వకంగానే కలిశానని చెప్పారు. గతంలో నితీష్ కుమార్ కు కరోనా సోకినప్పుడు ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు ఫోన్ చేశానని చెప్పారు.ఆరోగ్యం కుదుటపడిన తర్వాత తనను కలవాలని నితీష్ కుమార్ కోరగా ఇప్పుడు అది కార్యరూపం దాల్చిందని చెప్పారు. అంతేకానీ ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని చెప్పారు ప్రశాంత్ కిషోర్.

మరిన్ని వార్తల కోసం

 

రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పట్టించుకోట్లే

పోలీసులను ఆశ్రయించిన సినీ రచయిత చిన్ని కృష్ణ