రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పట్టించుకోట్లే

రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పట్టించుకోట్లే

హైదరాబాద్: కేసీఆర్ ను ఒక్క మాటన్నా ఊరుకునేది లేదంటూ శుక్రవారం సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల స్పందించారు. మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని అప్పులకుప్పల మార్చిన ఘనత టీఆర్ఎస్ దేనని ఆమె విమర్శించారు. నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులను త్వరలో అంటూ రోజూ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ‘వ్యవసాయాన్ని బందు పెట్టి, మద్దతు ధర ఇవ్వకుండా రైతులను అప్పులెగ్గొట్టే దొంగలను చేసిన దొరలు మీరు. రైతు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటుంటే పట్టించుకోని నాయకులు కూడా మీరే. సాగునీళ్ల పేరు చెప్పి.. లక్షకోట్లతో పర్యాటకానికి కాళేశ్వరం కట్టి ఎత్తిన నీళ్లని పారబోసుట్ల మీరు తోపులు. దళితులను అణగదొక్కడంలో, మహిళలను అవమానించడంలో, బీసీలను వాడుకుని వదిలేయడంలో మిమ్మల్ని మించిన వాళ్లు లేరు’ అని షర్మిల ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు ‘60 ఏండ్లల్ల ఏమీ జరగలె.. ఎనిమిదేండ్లల్లనే అన్నీ చేసినం’ అనే శీర్షికతో వీ6 వెలుగు దినపత్రికలో ప్రచురితమైన వార్తా కథనాన్ని ఆమె జత చేశారు. 

మరిన్ని వార్తల కోసం:

రెండు నెలల్లో టీఆర్ఎస్ కు లీడర్ ఉండడు

భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ కు కేసీఆర్

మేడారం జాతరను ప్రభుత్వాలు గుర్తించట్లే