అధికారుల తీరుపై బీజేపీ నేత వినూత్న నిరసన

అధికారుల తీరుపై బీజేపీ నేత వినూత్న నిరసన

దేవాలయాల నిర్వహణలో దేవాదాయ శాఖ అధికారుల తీరుకు ఓ బీజేపీ నేత వినూత్నంగా నిరసన తెలిపారు. సికింద్రాబాద్ కు చెందిన బీజేపీ నాయకుడు శ్యామ్ సుందర్ అబిడ్స్ బొగ్గుల కుంటలోని దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ కార్యాలయ ప్రాంగణంలో పిచికారీ చేస్తూ పరిసరాలను శుభ్రం చేశాడు. తాను సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయంలో అర్చన కోసం వెళ్ళినప్పుడు... అమ్మవారి విగ్రహం మీద పురుగులు తిరగడం చూసి దానిపై అక్కడి అధికారులను ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. తననే శుభ్రం చేసుకోవాలని అధికారులు మాట్లాడిన తీరుకు నిరసనగా దేవాదాయ శాఖ కార్యాలయాన్ని పరిశుభ్రం చేసినట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై దేవాదాయ శాఖ కమిషనర్ కు ఫిర్యాదు చేశానని స్పష్టం చేశారు. మరోసారి అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.