ట్రై నేషన్స్‌‌‌‌ వన్డే టోర్నీ.. ఇండియా నాలుగో గెలుపు

ట్రై నేషన్స్‌‌‌‌ వన్డే టోర్నీ.. ఇండియా నాలుగో గెలుపు

జొహనెస్‌‌‌‌బర్గ్‌: ట్రై నేషన్స్‌‌‌‌ వన్డే టోర్నీలో ఇండియా అండర్‌‌‌‌–19 టీమ్‌‌‌‌ వరుసగా నాలుగో విక్టరీని అందుకుంది. ఛేజింగ్‌‌‌‌లో ఉదయ్‌‌‌‌ శరణ్‌‌‌‌ (112) సెంచరీతో చెలరేగడంతో.. శనివారం జరిగిన ఆఖరిదైన నాలుగో లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లోనూ యంగ్‌‌‌‌ టీమిండియా 6 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాకు చెక్‌‌‌‌ పెట్టింది. 

ఇప్పటికే ఫైనల్‌‌‌‌ బెర్త్‌‌‌‌ ఖాయం చేసుకున్న ఇండియా టాస్‌‌‌‌ నెగ్గి ఫీల్డింగ్‌‌‌‌ ఎంచుకోగా, సౌతాఫ్రికా 50 ఓవర్లలో 256 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. స్టీవ్‌‌‌‌ స్టోల్క్‌‌‌‌ (69), దేవన్‌‌‌‌ మరియాస్‌‌‌‌ (32), రిలే నోర్టన్‌‌‌‌ (32), సిపో పోస్తానె (31) రాణించారు. ముషీర్‌‌‌‌ ఖాన్‌‌‌‌ 5, నమన్‌‌‌‌ తివారీ 3 వికెట్లు తీశారు. తర్వాత ఇండియా 48.4 ఓవర్లలో 260/4 స్కోరు చేసి గెలిచింది. రెండు రన్స్‌‌‌‌కే రుద్ర పటేల్‌‌‌‌ (1), ఇనేష్‌‌‌‌ ఖాన్‌‌‌‌ (0) ఔటైనా, ఉదయ్‌‌‌‌ కీలక ఇన్నింగ్స్‌‌‌‌ ఆడాడు. ముషీర్‌‌‌‌ ఖాన్‌‌‌‌ (41)తో మూడో వికెట్‌‌‌‌కు 90, ప్రియాన్షు మోలియా (76 నాటౌట్‌‌‌‌)తో నాలుగో వికెట్‌‌‌‌కు 133 రన్స్‌‌‌‌ జోడించాడు. కెనా ఎంపాక 2 వికెట్లు పడగొట్టాడు. సోమవారం జరిగే మ్యాచ్‌‌‌‌లో సౌతాఫ్రికా.. అఫ్గాన్‌‌‌‌తో తలపడుతుంది.