IND vs SA 2nd ODI: రెండో వన్డేలో సఫారీలదే టాస్‌.. రింకూ సింగ్‌ అరంగ్రేటం

 IND vs SA 2nd ODI: రెండో వన్డేలో సఫారీలదే టాస్‌.. రింకూ సింగ్‌ అరంగ్రేటం

సెయింట్‌ జార్జెస్‌ పార్క్‌ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య నేడు రెండో వన్డే జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్‌ గెలిచి మొదట బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో భారత్ జట్టు తొలుత బ్యాటింగ్‌ చేయనుంది. ఈ మ్యాచ్‌ ద్వారా టీమిండియా టీ20 నయా ఫినిషర్‌ రింకూ సింగ్‌ వన్డేల్లోకి అరంగ్రేటం చేయనున్నాడు. 

తుది జట్లు

దక్షిణాఫ్రికా: టోనీ డి జోర్జి, రీజా హెండ్రిక్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్‌రమ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్ , కేశవ్ మహారాజ్, నాండ్రే బర్గర్, లిజాద్ విలియమ్స్, బ్యూరాన్ హెండ్రిక్స్.

ఇండియా: రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, సంజు శాంసన్, కేఎల్ రాహుల్(కెప్టెన్, వికెట్ కీపర్), రింకు సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్.