ఒకేరోజు ఎక్కువ కేసులు నమోదైన దేశంగా భారత్

ఒకేరోజు ఎక్కువ కేసులు నమోదైన దేశంగా భారత్

దేశంలో కరోనా తీవ్రత ఎక్కువైంది. సెకండ్ వేవ్ ప్రారంభమైనప్పటి నుంచి కేసుల సంఖ్య మరీ ఎక్కువైంది. ప్రతిరోజూ లక్షల్లో కేసుల్లో నమోదవుతున్నాయి. తాజాగా భారత్‌లో కరోనా కేసులు 3 లక్షలు దాటాయి. దాంతో ప్రపంచంలో ఒకేరోజు ఎక్కువ కేసులు నమోదైన దేశంగా భారత్ నిలిచింది. బుధవారం దేశవ్యాప్తంగా 3,14,835 కేసులు నమోదయ్యాయి. దాంతో ఇప్పటివరకు దేశంలో 1,59,30,965 కేసులు రిజిష్టర్ అయ్యాయి. అదేవిధంగా నిన్న ఒక్కరోజే 2,104 మంది కరోనాతో మరణించారు. దేశంలో మొత్తం మరణాల సంఖ్య 1,84,657కు చేరింది. కాగా.. బుధవారం 1,78,841 మంది డిశ్చార్జ్ అయ్యారు. దాంతో మొత్తం రికవరీల సంఖ్య 1,34,54,880కు చేరింది. ప్రస్తుతం దేశంలో 22,91,428 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 27,27,05,103 శాంపిళ్లు పరీక్షించామని.. నిన్న ఒక్కరోజే 16,51,711 టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది.