టీ20 క్రికెటర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద ఇయర్‌‌‌‌ రేస్‌‌‌‌లో సూర్య

టీ20 క్రికెటర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద ఇయర్‌‌‌‌ రేస్‌‌‌‌లో సూర్య

దుబాయ్‌‌‌‌: ఇండియా స్టార్‌‌‌‌ క్రికెటర్‌‌‌‌ సూర్య కుమార్‌‌‌‌ యాదవ్‌‌‌‌.. ఐసీసీ ‘టీ20 క్రికెటర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద ఇయర్‌‌‌‌’ అవార్డు రేస్‌‌‌‌లో నిలిచాడు. 2022లో ఈ అవార్డు నెగ్గిన సూర్య.. గతేడాది షార్ట్‌‌‌‌ ఫార్మాట్‌‌‌‌లో 17 ఇన్నింగ్స్‌‌‌‌ల్లో 733 రన్స్‌‌‌‌ సాధించాడు. అతని యావరేజ్‌‌‌‌ 48.66 కాగా, స్ట్రయిక్‌‌‌‌ రేట్‌‌‌‌ 155.95గా ఉంది. సికిందర్‌‌‌‌ రజా (జింబాబ్వే), మార్క్‌‌‌‌ చాప్‌‌‌‌మన్‌‌‌‌ (న్యూజిలాండ్‌‌‌‌), అల్పేష్‌‌‌‌ రామ్జాని (ఉగాండ) కూడా ఈ అవార్డు కోసం పోటీపడుతున్నారు. 

‘ఎమర్జింగ్‌‌‌‌ క్రికెటర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద ఇయర్‌‌‌‌’ అవార్డు కోసం నలుగురు నామినీలను ఎంపిక చేశారు. ఇండియా యంగ్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ యశస్వి జైస్వాల్‌‌‌‌, రచిన్‌‌‌‌ రవీంద్ర (న్యూజిలాండ్‌‌‌‌), గెరాల్డ్‌‌‌‌ కోయెట్జీ (సౌతాఫ్రికా), దిల్షాన్‌‌‌‌ మధుషనక (శ్రీలంక) ఇందులో ఉన్నారు. గతేడాది యశస్వి టెస్ట్‌‌‌‌ల్లో 283, టీ20ల్లో 430 రన్స్‌‌‌‌ చేశాడు.