అండర్‌‌–19 టీమ్ ట్రై నేషన్స్‌‌ వన్డే టోర్నీలో.. ఫైనల్లో ఇండియా

అండర్‌‌–19 టీమ్  ట్రై నేషన్స్‌‌ వన్డే టోర్నీలో.. ఫైనల్లో ఇండియా

జొహనెస్‌‌బర్గ్‌ ‌:  ఇండియా అండర్‌‌–19 టీమ్  ట్రై నేషన్స్‌‌ వన్డే టోర్నీలో హ్యాట్రిక్‌‌ విజయాలతో ఫైనల్ చేరుకుంది.  గురువారం జరిగిన మూడో లీగ్‌‌ మ్యాచ్‌‌లో టీమిండియా 9 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్‌‌పై గెలిచింది. టాస్‌‌ ఓడిన అఫ్గాన్ 33 ఓవర్లలో 88 రన్స్‌‌కే ఆలౌటైంది. 

నాసిర్‌‌ హుస్సేన్‌‌ (31) టాప్‌‌ స్కోరర్‌‌. నమన్‌‌ తివారీ 4, ధనుష్‌‌, ఆరాధ్య శుక్లా, ప్రియాన్షు తలో రెండు వికెట్లు తీశారు. తర్వాత ఇండియా 12.1 ఓవర్లలో 92/1 స్కోరు చేసి నెగ్గింది. ఆదర్ష్‌‌ సింగ్‌‌ (52 నాటౌట్‌‌) ఫిఫ్టీతో రాణించాడు. శనివారం జరిగే ఆఖరి లీగ్‌‌ మ్యాచ్‌‌లో ఇండియా.. సౌతాఫ్రికాతో తలపడుతుంది.