
లండన్: ఇండియాతో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఇండియా–ఎపై రాణించిన ఇంగ్లండ్ లయన్స్ పేసర్ ఎడ్జీ జాక్ను ట్రెయినింగ్ క్యాంప్కు పిలిపించారు. ఇంగ్లండ్ ప్రధాన బ్యాటర్లకు అతను బౌలింగ్ చేసినట్లుగా సమాచారం. 19 ఏళ్ల జాక్.. రెండో అనధికార టెస్ట్లో సెంచరీ సాధించడంతో పాటు కేఎల్ రాహుల్ను ఔట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.
గత నెలలో జింబాబ్వేతో జరిగిన వామప్ మ్యాచ్లో ఐదు వికెట్లు తీసిన అతను నార్తాంప్టన్లో నితీశ్ రెడ్డి, ధ్రువ్ జురెల్తో సహా టీమిండియా టెస్ట్ స్టార్లకు కొరకరాని కొయ్యగా మారాడు. గాయాల కారణంగా జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, అట్కిన్సన్ ఈ సిరీస్కు దూరం కావడంతో ఇంగ్లండ్ పేస్ బలం బాగా క్షీణించింది. దాంతో జాక్ను ఉన్న ఫళంగా ట్రెయినింగ్ క్యాంప్లోకి తీసుకున్నారు. ఇండియా–ఎతో జరిగిన మ్యాచ్లో క్రిస్ వోక్స్, జోష్ టంగ్ రాణించడంతో ఇంగ్లండ్కు ఉపశమనం కలిగించే అంశం.