విశాఖ వేదికగా భారత, సౌతాఫ్రికా జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ ఇవాళ(బుధవారం) ఉదయం ప్రారంభమైనది. టాస్ గెలిచిన టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ ఓపెనర్గా బరిలో దిగాడు.
మొదట బ్యాటింగ్కు దిగిన కోహ్లీ సేన 60 ఓవర్లలో 202 పరుగులు సాధించి భారీ స్కోర్ దిశగా సాగుతోంది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ అద్భుతంగా రాణిస్తున్నారు. రోహిత్ శర్మ 154 బంతుల్లో 10 ఫోర్లు , 4 సిక్సర్లతో సెంచరీ సాధించాడు. రోహిత్ ఓపెనర్గా దిగిన తొలి టెస్టు, తొలి ఇన్నింగ్స్లోనే సెంచరీ సాధించాడు. ప్రస్తుతం రోహిత్ 174 బంతుల్లో 115 పరుగులతో మయాంక్ 183 బంతుల్లో 84 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.