క్రికెట్‌‌‌‌ కోచింగ్‌‌‌‌లోకి జ్వాల

క్రికెట్‌‌‌‌ కోచింగ్‌‌‌‌లోకి జ్వాల

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : ఇండియా బ్యాడ్మింటన్ లెజెండ్ గుత్తా జ్వాల క్రికెట్ కోచింగ్‌‌‌‌లోకి అడుగు పెట్టింది. మూడేండ్ల కిందట మొయినాబాద్‌‌‌‌లోని సుజాత స్కూల్‌‌‌‌లో ఏర్పాటు చేసిన తన ‘జ్వాల గుత్తా అకాడమీ ఆఫ్ ఎక్స్‌‌‌‌లెన్స్‌‌‌‌’లో  విమెన్స్‌‌‌‌ క్రికెట్ అకాడమీని సోమవారం ప్రారంభించింది. తన అకాడమీ కేవలం బ్యాడ్మింటన్‌‌‌‌కే పరిమితం కాదని జ్వాల తెలిపింది.

.అన్ని ఆటల్లోనూ యంగ్‌‌‌‌స్టర్స్‌‌‌‌కు కోచింగ్‌‌‌‌ ఇచ్చి చాంపియన్స్‌‌‌‌గా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించింది. ఈ క్రమంలో మొదటగా విమెన్స్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ కోసం రెసిడెన్షియల్ క్యాంపస్‌‌‌‌  ఏర్పాటు చేసినట్టు తెలిపింది. ఈ అకాడమీలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ప్రొఫెషనల్ కోచ్‌‌‌‌లు అందుబాటులో ఉంటారని చెప్పింది.