ఉప రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్​ ఖరారైంది

ఉప రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్​ ఖరారైంది

న్యూఢిల్లీ, వెలుగు: దేశ 16వ ఉప రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్​ ఖరారైంది. ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవీ కాలం ఆగస్టు 10తో ముగియనుండడంతో ఆగస్టు 6న ఎన్నిక నిర్వహిస్తున్నట్టు ఎలక్షన్​ కమిషన్​ తెలిపింది. ఆగస్టు 6న ఓటింగ్ జరుగుతుందని తెలిపింది. అదేరోజు కౌంటింగ్​ చేసి ఫలితాలు వెల్లడిస్తామని పేర్కొంది. జులై 5న ఎన్నికల నోటిఫికేషన్​విడుదల, జులై 19 నామినేషన్లకు చివరి గడువు అని, 20న నామినేషన్ల పరిశీలన ఉంటుందని పేర్కొంది. నామినేషన్ల విత్​డ్రా గడువు జులై 22 వరకు ఉంటుందని తెలిపింది. కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రక్షణ చర్యలు తీసుకుంటామని ఎలక్షన్​ కమిషన్ ప్రకటించింది.