రైలు టికెట్ల ధరల్లో స్వల్ప పెంపు.. జులై 1 నుంచి అమలు..ఇండియన్ రైల్వే నిర్ణయం

రైలు టికెట్ల ధరల్లో స్వల్ప పెంపు..  జులై 1 నుంచి అమలు..ఇండియన్ రైల్వే నిర్ణయం
  • ఏసీ క్లాస్ టికెట్లకు కిలో మీటరుకు 2 పైసలు పెంపు

న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఏసీ, నాన్- ఏసీ మెయిల్, ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్, సెకండ్ క్లాస్ టికెట్ల ధరలను స్వల్పంగా పెంచింది. పెరిగిన ధరలు జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. 500 కి.మీ. వరకు సాధారణ సెకండ్ క్లాస్ టికెట్ల ధరలు యథాతథంగా ఉంటాయని.. అయితే 500 కి.మీ. దాటిన ప్రయాణాలకు కిలోమీటరుకు అరపైసా పెంపు ఉంటుందని వెల్లడించింది. దేశవ్యాప్తంగా రోజూ 13 వేలకి పైగా నాన్-ఏసీ మెయిల్, ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్ ట్రైన్లు నడుస్తున్నాయి.

మెయిల్/ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్ రైళ్లలో నాన్-ఏసీ తరగతి ప్రయాణానికి కిలో మీటరుకు ఒక పైసా పెంచారు. అదే విధంగా.. ఏసీ క్లాస్ ప్రయాణానికి కిలో మీటరుకు 2 పైసలు పెంచారు. సబర్బన్ టికెట్లు లేదా మంత్లీ సీజన్ టికెట్ (ఎమ్ఎస్టీ) ధరల్లో ఎలాంటి పెంపు ఉండదు. పెరిగిన స్వల్ప ధరలతో  తక్కువ దూరం వెళ్లే ప్రయాణికులపై ఎలాంటి భారం పడదని అధికారులు తెలిపారు.

తత్కాల్ టిక్కెట్లకు ఆధార్ తప్పనిసరి

తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం భారతీయ రైల్వేలు ఆధార్ తప్పనిసరి చేసింది. ఈ నిబంధన కూడా జులై 1 నుంచే అమలులోకి వస్తుంది. ఈ కొత్త నియమం ప్రకారం..ఐఆర్సీటీసీ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్ లేదా యాప్ ద్వారా తత్కాల్ టికెట్లు బుక్ చేయడానికి ఆధార్ ధ్రవీకరణ అవసరం. ఇక జులై 15 నుంచి అన్ని తత్కాల్ బుకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు (ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్, కౌంటర్, అధీకృత ఏజెంట్ల ద్వారా) ఆధార్ ఆధారిత ఓటీపీ ధ్రువీకరణ కూడా తప్పనిసరి అవుతుంది. టికెట్ బుకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పారదర్శకతను పెంచడానికి, మోసాలను నిరోధించడానికే ఈ చర్య తీసుకున్నట్లు ఇండియన్ రైల్వే పేర్కొంది.