శనివారం పొద్దున జరిగిన టెర్రర్ హంట్ లో ఓ కశ్మీరీని రక్షిస్తూ నాయక్ రాజేంధ్ర సింగ్ అనే జవాన్ అమరుడయ్యాడు. జమ్మూ కశ్మీర్ రాంబన్ జిల్లా బటోట్ మార్కెట్ ఏరియాలో… టెర్రరిస్టులు చొరబడ్డారన్న సమాచారంతో శనివారం ఉదయం ఆర్మీ గాలింపు నిర్వహించింది. దీంతో ముగ్గురు ఉగ్రవాదులు తప్పించుకునే క్రమంలో ఓ ఇంట్లో దాక్కున్నారు. ఆ ఇంట్లోని ఒక వ్యక్తిని బంధించి బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఆర్మీ అలర్ట్ అయింది. 8గంటల ఆపరేషన్ చేసి ఆ కశ్మీరిని రక్షించారు. ముగ్గురు టెర్రరిస్టులు బలగాల చేతిలో హతమయ్యారు. కశ్మీరీని రక్షించే క్రమంలో నాయక్ రాజేంద్ర సింగ్ అనే జవాను ప్రాణాలోదిలారు. రాజేంద్ర ఫొటోను ఆర్మీ రిలీజ్ చేసింది. రాజేంద్ర అండ్ టీం చేసిన సాహసానికి దేశప్రజలు సెల్యూట్ చేస్తున్నారు.
Jammu and Kashmir: Indian Army's Naik Rajendra Singh lost his life during the encounter in Batote town of Ramban district of Jammu Zone, earlier today. (Image source: Indian Army) pic.twitter.com/f5C98QGcaf
— ANI (@ANI) September 28, 2019