ఓ కశ్మీరీని రక్షిస్తూ ప్రాణాలొదిలిన వీర జవాన్ ఇతడే

ఓ కశ్మీరీని రక్షిస్తూ ప్రాణాలొదిలిన వీర జవాన్ ఇతడే

శనివారం పొద్దున జరిగిన టెర్రర్ హంట్ లో ఓ కశ్మీరీని రక్షిస్తూ నాయక్ రాజేంధ్ర సింగ్ అనే జవాన్ అమరుడయ్యాడు. జమ్మూ కశ్మీర్‌ రాంబన్ జిల్లా బటోట్ మార్కెట్ ఏరియాలో…  టెర్రరిస్టులు చొరబడ్డారన్న సమాచారంతో శనివారం ఉదయం ఆర్మీ గాలింపు నిర్వహించింది. దీంతో ముగ్గురు ఉగ్రవాదులు తప్పించుకునే క్రమంలో ఓ ఇంట్లో దాక్కున్నారు. ఆ ఇంట్లోని ఒక వ్యక్తిని బంధించి బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఆర్మీ అలర్ట్ అయింది. 8గంటల ఆపరేషన్ చేసి ఆ కశ్మీరిని రక్షించారు. ముగ్గురు టెర్రరిస్టులు బలగాల చేతిలో హతమయ్యారు. కశ్మీరీని రక్షించే క్రమంలో నాయక్ రాజేంద్ర సింగ్ అనే జవాను ప్రాణాలోదిలారు. రాజేంద్ర ఫొటోను ఆర్మీ రిలీజ్ చేసింది. రాజేంద్ర అండ్ టీం చేసిన సాహసానికి దేశప్రజలు సెల్యూట్ చేస్తున్నారు.