ఏప్రిల్ 24న ఇంటర్ రిజల్ట్స్

ఏప్రిల్ 24న ఇంటర్ రిజల్ట్స్

 హైదరాబాద్, వెలుగు: ఈ నెల 24న ఇంటర్ పరీక్షల ఫలితాలను అధికారులు రిలీజ్ చేయనున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం బుధవారం ఉదయం 11 గంటలకు రిజల్ట్స్ రిలీజ్ చేయనున్నారు. ఎలాంటి తప్పులు దొర్లకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, ఆ తర్వాతే ఫలితాలు రిలీజ్ చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.

 రాష్ట్రంలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. వీటికి 9.80 లక్షల మంది అంటెండ్ అయ్యారు. కాగా, ఏపీలో మార్చి 1 నుంచి 20 వరకు  ఇంటర్ పరీక్షలు జరగ్గా, ఈ నెల 12న ఫలితాలు ఇచ్చారు. దీంతో తెలంగాణ అధికారులపై ఒత్తిడి పెరిగింది.