గుండెపోటుతో ఇంటర్ విద్యార్థిని మృతి... క్లాస్ రూమ్​లో పాఠాలు వింటూ...

గుండెపోటుతో ఇంటర్ విద్యార్థిని మృతి... క్లాస్ రూమ్​లో పాఠాలు వింటూ...

కూకట్ పల్లి, వెలుగు: ఇంటర్ విద్యార్థిని క్లాస్ రూమ్​లో ఒక్కసారిగా కుప్పకూలిన ఘటన కూకట్ పల్లి పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆల్విన్ కాలనీలో ఉండే వెన్నెల కుమార్తె నాగపట్ల మానస(16) కూకట్​పల్లిలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ ఎంపీసీ ఫస్టియర్ చదువుతోంది. శుక్రవారం ఇంటి నుంచి కాలేజీకి వెళ్లిన మానస సాయంత్రం 5 గంటలకు ఒక్కసారిగా క్లాస్ రూమ్​లోనే కుప్పకూలింది. 

కాలేజీ మేనేజ్ మెంట్ వెంటనే మానస కుటుంబసభ్యులకు సమాచారం అందించి దగ్గరలోని ఆస్పత్రికి ఆమెను తరలించింది. అప్పటికే విద్యార్థిని మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మానస కొంతకాలంగా గుండెకు సంబంధించిన సమస్యతో బాధపడుతోందని, ట్రీట్ మెంట్ జరుగుతోందని ఆమె కుటుంబసభ్యులు తెలిపినట్లు సమాచారం. డెడ్ బాడీని గాంధీకి తరలించిన పోలీసులు.. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.